కొద్ది కాలంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని ఫోన్లో బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్రెడ్డికి ఫోన్ చేసిన నిందితుడు చంపేస్తానంటూ ఫోన్కాల్లో బెదిరించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా ఫోన్లు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్గా గుర్తించారు. కువైట్లో క్యాబ్ డ్రైవర్గా పని చేసి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కడప జిల్లాలో నివసిస్తున్నట్టుగా సమాచారం .గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా నిందితుడు కిషన్రెడ్డికి పలుసార్లు ఫోన్ చేసి బెదిరించినట్లు పోలీసులు తెలుపుతున్నారు..