ప్రశ్నాపత్రంతో పాటు జవాబు పత్రం కూడా తీసుకెళ్లాడు..

ప్రశ్నాపత్రంతో పాటు జవాబు పత్రం కూడా తీసుకెళ్లాడు..

ఇంటర్‌ పరీక్ష రాసిన ఓ విద్యార్థి పరీక్ష ముగిసిన అనంతరం ప్రశ్నాపత్రంతో పాటు జవాబు పత్రాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్లి చివరకు కటకటాలపాలయ్యాడు.వివాదాలు,విమర్శలు,నిరసనలు ఎదుర్కొన్న అనంతరం కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఇంటర్‌ బోర్డు పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన గణిత పరీక్ష నిర్వహించగా ఇస్లామియా కాలేజీలో గణీత పరీక్షకు హాజరైన మహ్మద్‌ హుజేఫ్‌ అనే విద్యార్థి పరీక్ష ముగిసిన అనంతరం ప్రశ్నాపత్రంతో పాటు జవాబు పత్రాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు.విద్యార్థి జవాబు పత్రాన్ని తీసుకెళ్లినట్లు గుర్తించిన ఇన్విజిలేటర్‌ అదేరోజు రెయిన్‌ బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇస్లామియా కాలేజీ వద్దే అరెస్ట్‌ చేసి జవాబు పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండా అటు ఇంటికి కూడా తీసుకెళ్లకుండా బ్యాగులో పెట్టుకొని తిరుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos