విశాఖ పట్టణం: ఇసుక కొరత నివారణ చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించదలచిన పాద యాత్రకు తెలుగు దేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఆదివారం ఇక్కడ జరగనున్న యాత్రలో తెదేపా నేతలు అచ్చె న్నాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు పాల్గొననున్నారు. పాదయాత్రకు సంఘీ భావాన్ని తెలిపిన వామపక్షాలు పాదయాత్రలో పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనబోమని తెలిపాయి. ఆందోళనకు భాజపా సహకారం తీసుకునేందుకు జనసేన పార్టీ సుముఖంగా ఉన్నందున తాము పాద యాత్రకు దూరమయ్యామని వివరించాయి.