ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఇటీవల శ్రీలంకతో జరిగిన టోర్నీ వరకు పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో పాక్ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలంగా సారథిగా వ్యవహరించిన సర్ఫరాజ్ను సారథి బాధ్యతలతో పాటు జట్టు నుంచి కూడా తప్పించిన నేపథ్యంలో సర్ఫరాజ్ ఇక వీడ్కోలు పలకాలంటూ వినిపిస్తున్న డిమాండ్లపై సర్ఫరాజ్ భార్య కుష్ బహత్ మండిపడ్డారు.పాక్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన తన భర్త ఎందుకు వీడ్కోలు పలకాలంటూ ప్రశ్నిస్తూనే భారత జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఇందులోకి లాగారు.సర్ఫరాజ్ కంటే ధోనీ వయసలు చాలా పెద్దవాడని మరి ధోనీ రిటైర్ కానప్పుడు సర్ఫరాజ్ ఎందుకు రిటైరవ్వాలంటూ వింత లాజిక్కు తీశారు.సర్ఫరాజ్ ఓ పోరాట యోధుడని, తప్పకుండా జట్టులోకి పునరాగమనం చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది..