ప్రైవేట్ కంపెనీలో గోడ కూలి ఒకరు మృతి

ప్రైవేట్ కంపెనీలో గోడ కూలి ఒకరు మృతి

హోసూరు పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో గోడకూలి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జూజువాడి సమీపంలోని ప్రైవేట్ పైపుల తయారీ కంపెనీలో 50 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ కంపెనీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మహేశ్వర, శరత్ బోరా, దాసానాథ్ మాలిక్ అనే కార్మికులు ఓ తొట్టిలోని ఇనుప పైపులను మరో చోటికి తరలిస్తుండగా, తొట్టికి ఆనుకొని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సంఘటనలో తొట్టిలో పైపులు తొలగిస్తూన్న మహేశ్వర శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందగా, శరత్ బోరా, దాసానాథ్ మాలిక్ తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు శిథిల్లాలో చిక్కుకుని గాయపడిన ఇద్దర్ని హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హోసూరు సిప్కాట్ పోలీసులకు సమాచారమందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాధీనపర్చుకొని హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos