దిశ తల్లితండ్రుల ప్రశ్నలకు మౌనమే సమాధానం..

దిశ తల్లితండ్రుల ప్రశ్నలకు మౌనమే సమాధానం..

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయడానికి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దిశ తల్లితండ్రులు సంధించిన ప్రశ్నలకు మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తమ కమార్తెపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినప్పుడు మానవహక్కుల కమిషన్ ఎక్కడకు పోయిందని ప్రశ్నించినట్లు తెలిసిందే. అప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు? అని నిలదీసినట్లు చెబుతున్నారు.తమ కుమార్తె కనిపించటం లేదని పోలీస్ స్టేషన్‌కు వెళితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. రెండో రోజు విచారణ కోసం దిశ కుటుంబ సభ్యులు రావాలని పోలీసులు కోరగా.. అధికారులకు.. దిశ కుటుంబ సభ్యులకు మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. తన కుమార్తె దశ దిన కర్మ జరుగుతున్న వేళ విచారణకు హాజరు కావాలంటూ కోరుతున్న వైనంపై కాలనీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు దిశ తండ్రి.. సోదరి తదితరులు విచారణకు హాజరయ్యారు. వారు సంధించిన ప్రశ్నలకు మౌనం వహించినట్లు చెబుతున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos