పొత్తుల పేరుతో పార్టీలను దెబ్బతీయడం బీజేపీ నైజం

పొత్తుల పేరుతో పార్టీలను దెబ్బతీయడం బీజేపీ నైజం

న్యూ ఢిల్లీ: జాతీయస్థాయిలో ఉండాలనుకున్న బీజేపీ లక్ష్యానికి తాము సహకరిస్తే ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యాలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ నవాబ్ మాలిక్ సమర్ధించారు. ఇది పచ్చి నిజమని చెప్పారు. బీజేపీతో ఏ పార్టీలైతే పొత్తు పెట్టుకున్నాయో ఆ పార్టీలను బీజేపీనే క్రమంగా ధ్వంసం చేస్తూ వచ్చిందని ఆయన చెప్పారు. ఎవరి మతం వారికి గర్వ కారణమని, అంతమాత్రాన ఇతర మతాలను ద్వేషించడం సరైనది కాదని బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని అధికార మహాకూటమిలో శివసేనతో ఎన్సీపీ, కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos