న్యూఢిల్లీ: ముఖ్య మంత్రి జగన్ వ్యక్తి గత సహాయకుడు నారాయణ అనా రోగ్యంతో శుక్రవారం మరణించారు. దరిమిలా జగన్ తన ఢిల్లీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్నారు. రాయలసీమ ప్రాంతానికే చెందిన నారాయణకు వైఎస్ కుటుంబంతో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నారు. నారాయణ స్వ గ్రా మం అనంతపురం జిల్లా దిగువపల్లె. నారాయణ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు.