ప్రకంపనలు సృష్టిస్తున్న నమ్రతా – జయా చాటింగ్ ఇదేనా?

ప్రకంపనలు సృష్టిస్తున్న నమ్రతా – జయా చాటింగ్ ఇదేనా?

బాలీవుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రపంకనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్‌వుడ్‌కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్‌ను సైతం చుట్టుకుంది. ముఖ్యంగా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌తో బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మీడియా మేనేజర్ జయా సాహా చాటింగ్ చేసినట్టు తేలింది. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంపాదించినట్లు వినికిడి. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.కోడ్ భాషలో ఉన్న ఒక్కో అక్షరాన్నీ డీ కోడ్ చేస్తున్న అధికారులు, రోజుకో పేరును బయటకు తీస్తున్నారు. ఎన్ అంటే నమ్రత అని, డీ అంటే దీపికా పదుకొనే అని, కే అంటే దీపిక మేనేజర్ కర్మిష్మా అని, జే అంటే జయా సాహా అని, ఎస్ అంటే శ్రద్ధా కపూర్ అని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ చాటింగ్స్‌లో నమ్రతతో పాటు జయ, దీపిక, కరిష్మా తదితరులు పాల్గొన్నట్టు నిర్ధారించుకున్న అధికారులు, ప్రస్తుతం మరింత లోతుగా దర్యాఫ్తు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. కాగా, అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఎన్, జే మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఇదే…ఎన్: ముంబైలో మంచి ఎండీ ఇస్తానని గతంలో హామీ ఇచ్చావు. నేను వచ్చినప్పుడు ఇవ్వాలి. నాకు బ్రేక్ కావాలి. మనం మంచి పార్టీ చేసుకుందాం.
జే: నన్ను డ్రగ్స్ అమ్మకందారుగా చేస్తున్నావు. అయినా సరే… నువ్వు ఎలా చెబితే అలా చేస్తానని టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రత చాటింగ్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి.మరో వైపు ఈ కేసులో దియా మిర్జా పేరు సైతం బయటపడింది. 2019లో దియా మిర్జా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆమెతో పాటు ఆమె మేనేజర్‌ను ఎన్సీబీ ప్రశ్నించే అవకాశం ఉంది.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos