నానా పటేకర్ నిర్దోషి

నానా పటేకర్ నిర్దోషి

ముంబై: మీ టూ కేసులో బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్ నిర్దోషిగా తేలాడు. పదేళ్ల క్రితం ‘హార్న్‌ ఓకే ప్లీజ్’ చిత్రీకరణలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించినట్లు సినీ నటి తనుశ్రీ దత్తా ఏడాది కిందట చేసిన ఆరోపణలకు సాక్షాధారాలు లభించలేదని పోలీసులు గురువారం న్యాయస్థానానికి తెలిపారు.దీంతో నానా పటేకర్‌ను న్యాయస్థానం నిర్ధోషిగా తేల్చింది. ‘ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపారు. కానీ సాక్ష్యాలు లేవని కేసును మూసేశారు. కాబట్టి తను శ్రీ ప్రొటెస్ట్‌ రిపోర్ట్ను దాఖలు చేయొచ్చు.దరిమిలా కేసును మరింత నిశితంగా విచారణ జరిపించే అవకాశం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంటుంది’ అని తనుశ్రీ తరఫు న్యాయవాది సుజయ్ విలేఖరులకు తెలిపారు. నానా పటేకర్‌కు భయపడి కొందరు ప్రత్యక్ష సాక్షులు తనకు మద్దతు ఇవ్వటం లేదని ఇటీవల తనుశ్రీ ఆరోపించారు. విచారణ ఆలస్యమైనా పటేకర్కు కచ్చితంగా శిక్షపడుతుందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos