జమ్ము: సరిహద్దులో సమస్యలపై భారత్, పాకిస్థాన్లు తమ రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు చేపట్టాలని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహ బూబా ముఫ్తీ కోరారు. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి రెండు వైపులా పెరుగుతున్న ప్రాణ నష్టాన్ని చూడటం చాలా విచారకమన్నారు.‘ఎల్ఓసీ వెంబడి ఇరు వైపులా ప్రాణ నష్టం పెరగటం విచారకరం. భారత్, పాకిస్థాన్ నాయకత్వం వారి రాజకీయ ఒత్తిళ్లను దాటి ఆలోచిస్తేనే చర్చలు ప్రారంభ మవుతాయి. మాజీ ప్రధాని వాజ్పేయీ జీ, ముషారఫ్ సాహబ్ అంగీకరించి, అమలు చేసిన కాల్పుల విరమణను పునరుద్ధరించేందుకు ఇదే మంచి సమయం’అని ట్వీట్ చేసారు.