పాక్లో ఇద్దరు భారతీయ అధికార్ల గల్లంతు

పాక్లో ఇద్దరు భారతీయ అధికార్ల గల్లంతు

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారత్‌కు చెందిన ఇద్దరు హై కమిషన్‌ అధికారులు అదృశ్యమయ్యారు. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈ ఇద్దరు అధికారులు రెండు గంటలుగా కనిపించడంలేదని జాతీయ మీడియా పేర్కొంది. స్థానిక అధికారులు పాక్‌ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారికోసం గాలిస్తున్నారని తెలిపింది. కాగా, ఇద్దరు భారత రాయబారులు మిస్సింగ్‌పై భారత ప్రభుత్వం ఆరా తీసింది. అక్కడి అధికారులను సంప్రదించి వారి వివరాలను సేకరిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos