ఏనుగును చంపిన వ్యక్తి అరెస్టు

ఏనుగును చంపిన వ్యక్తి అరెస్టు

హోసూరు : కృష్ణగిరి జిల్లా జవులగిరి సమీపంలోని చెన్నమాలం అటవీ ప్రాంతంలో నాటు తుపాకీతో ఏనుగును కాల్చి చంపిన వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. జవులగిరి సమీపంలోని చెన్నమాలం అటవీప్రాంతంలో ఏనుగు చనిపోయిన విషయమై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. అనంతరం అధికారులు ఏనుగుకు శవ పరీక్ష నిర్వహించారు. శవ పరీక్షలో ఏనుగు కడుపులో దిగిన బుల్లెట్లను గుర్తించారు. కేసు దర్యాప్తు చేపట్టిన అటవీ శాఖ అధికారులు చెన్నమాలం గ్రామానికి చెందిన ముత్తు మల్లేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వేటకు వెళ్లిన సమయంలో ఏనుగును కాల్చి చంపినట్లు అతను అంగీకరించడంతో నాటు తుపాకీని స్వాధీనపర్చుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos