శ్రీహ‌రిపై మంద‌కృష్ణ మాదిగ మ‌రోసారి ఫైర్

శ్రీహ‌రిపై మంద‌కృష్ణ మాదిగ మ‌రోసారి ఫైర్

వరంగల్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి మండిపడ్డారు. మాటిమాటికి విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. శ్రీహరికి విలువలు ఉంటే, విలువలతో కూడిన రాజకీయాలు చేయదలచుకుంటే స్టేషన్ ఘన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచావో ఆ పదవికి ముందు రాజీనామా చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఆ తర్వాతనే విలువల గురించి మాట్లాడాలని కడియం శ్రీహరికి మందకృష్ణ సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓటేయొద్దని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న మా దిగలకు ఒక్క లోక్సభ సీటు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ నెల 16 వరకు వేచి చూస్తామని, ఆతర్వాత ‘గోబ్యాక్ కాంగ్రెస్’ నినాదం ఎత్తుకుంటామని స్పష్టం చేశారు. ఆ పార్టీపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తామని, తమతో బీసీ, మైనార్టీలు కూడా కలిసి రావాలని కోరారు. వర్గీకరణకు మద్దతు ఇవ్వని కాంగ్రెస్.. మాదిగలకు ఏదో చేస్తుందన్న నమ్మకం లేదని, పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించేందుకు ఒక్క ఎంపీకి అవకాశం ఇవ్వనప్పుడు ఆ పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos