దిగుమతి సుంకాలు పెంచి. మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా?

దిగుమతి సుంకాలు పెంచి. మేకిన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా?

హైదరాబాదు: ‘ఓ వైపు దిగుమతి సుంకాలు పెంచుతూ మరోవైపు మేకిన్ ఇండియా అంటే కంపెనీలు బారులు తీరి వస్తాయా?’ అని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సీఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించారు. ‘కేంద్రం చేస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలు వినడానికి బాగున్నా, అమలు తీరే సరిగా లేదు. మేకిన్ ఇండియా అంటూ ఫార్మా రంగానికి సంబంధించి అత్యధికంగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. హైదరాబాదులో భారీ స్థాయిలో ఫార్మా పార్కు స్థాపనకు కేంద్రం సహకరించడంలేదు. ఇప్పటివరకు ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్) ఊసేలేదు. ప్రాజెక్టు రిపోర్టులు పంపినా పట్టించుకోవడం లేదు.తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రం కాదా?’ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను కేంద్రం అమలు చేయడంలేదు. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతున్న కేంద్రం ఆ మేరకు కేటాయింపులు చేయకపోవడం అన్యాయం. కేంద్రం హామీలు ఇచ్చి మాట నిలుపుకోని పక్షంలో ఇంకెవర్ని అడగాల’ని ఆక్రోశిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos