‘కాంగ్రెస్‌ను జనం ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు’

‘కాంగ్రెస్‌ను జనం ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు’

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పునరు త్తేజం కోసం అనుభవంతో కూడిన ఆలోచనలు చేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించ గల సామర్థ్యంతో పాటు రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అవసరమ’ని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మంగళవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ‘పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవి చూసింది. తాము ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించ లేదు. కాంగ్రెస్ పార్టీ తెలివైనది. ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో తప్పకుండా గుర్తిస్తుంది. ప్రజలు మనతో కలిసి రావాలనుకోవడం సరైంది కాదు. మనమే ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేయాలి. అనుభవం ఉన్నవారిని ప్రోత్సహించాలి. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. బిహార్తో పాటు ఉప ఎన్నికల్లో ఓటమిని సాధారణ విషయంగానే భావిస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు పార్టీ భావిస్తున్నట్లు ఉందేమో. అధినాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ ఎంపీ కార్తి చిదంబరం ట్వీట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేసి గత ఆగస్టులో లేఖ రాసిన 23 మందిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos