హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ఈ నెల 21న ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది. జగన్ను వ్యక్తిగతంగా కలసి ఆహ్వానించడానికి త్వరలో కేసీఆర్ విజయవాడ వెళ్లనున్నారు.