పట్టు బిగిస్తున్న ఇండియా

  • In Sports
  • March 5, 2021
  • 206 Views
పట్టు బిగిస్తున్న ఇండియా

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లండ్‌పై 89 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నేటి ఆటలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ ఆట ఆకట్టుకుంది. పర్యాటక జట్టుపై ఆధిక్యం సాధించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు బంతితో విరుచుకుపడుతున్న వేళ… పంత్, సుందర్ ఇద్దరూ సవాలును స్వీకరించారు. పంత్ టెస్టుల్లో మూడో సెంచరీ (101) చేసి అవుటవగా, సుందర్ 60 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 49 పరుగులు చేసి అవుటవగా, పుజారా 17, రహానే 27, అశ్విన్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. గిల్, కెప్టెన్ కోహ్లీ ఇద్దరూ డకౌట్ అయ్యారు. అక్షర్ పటేల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు తీసుకోగా, స్టోక్స్, జాక్ లీచ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos