అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను ప్రభుత్వం నియమించింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇన్ఛార్జి మంత్రులు పర్యవేక్షిస్తారు. శ్రీకాకుళం-వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం-రంగనాథరాజు, విశాఖపట్నం-మోపిదేవి వెంకటరమణ, తూర్పు గోదావరి-ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి-పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా-కురసాల కన్నబాబు, గుంటూరు-పేర్నినాని, ప్రకాశం-అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు-మేకతోటి సుచరిత, చిత్తూరు-మేకపాటి గౌతంరెడ్డి, కడప-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కర్నూలు-బొత్స సత్యనారాయణ.