వికారాబాద్ : తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లలో చేర్పించడానికి తాపత్రయపడే తల్లిదండ్రులున్న ఈ కాలంలో, ఓ జిల్లా కలెక్టర్ తద్విరుద్ధంగా తన కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వికారాబాద్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ తన కుమార్తెను ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారని, ఆమె నిర్ణయం స్ఫూర్తిదాయకమని తెలంగాణ మైనారిటీ గురుకులాల కార్యదర్శి షఫీయుల్లా ప్రశంసించారు. మైనారిటీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ బోధనా పద్ధతులతోనే వారిని ప్రొఫెనల్స్గా తీర్చి దిద్దడానికి నిరంతరం పాటు పడుతున్నామని తెలిపారు. కాగా కలెక్టర్ తన కుమార్తె తాబిష్ రైనాను వికారాబాద్ పాఠశాల-1లో చేర్పించారు.