వాళ్లను వదలను..

వాళ్లను వదలను..

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రజలు,పలు రంగాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తుండగా నిందితుల కుటుంబ సభ్యులు కొంతమంది సోకల్డ్‌ మేధావులు,మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు మాత్రం నిందితులకు మద్దతుగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి న్యాయం చేశారని ప్రజలు,ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తుండగా నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేసి తమకు అన్యాయం చేశారని నిందితుల కుటుంబాలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి.అందుకు ఈ మేధావులు,మానవ హక్కుల సంఘాలు,కొన్ని మహిళా సంఘాలు సైతం నిందితుల కుటుంబాల తరపున వకాల్త పుచ్చుకున్నాయి.ఈ నేపథ్యంలో మొదటినుంచి ఎన్‌కౌంటర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక మరోసారి పోలీసులపై విరుచుకుపడింది. తన భర్తను చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసులను తాను వదలనని చటాన్‌పల్లి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుక స్పష్టం చేసింది.తన భర్త ముఖంపై వేడి నీళ్లు పోసి కొట్టారని తెలిసిందని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తన భర్తను వేధించి, చిత్ర హింసలు పెట్టి చంపిన పోలీసులను తాను వదలబోనని ఆమె చెప్పారు. తనపైనే కుటుంబ బారం పడిందన్నారు. తనకు పుట్టబోయే బిడ్డకు ఏం చెప్పాలని ఆమె నిలదీశారు. తొమ్మిది నెలల పిల్లను రేప్ చేసిన వారికి ఇప్పటివరకు ఎలాంటి శిక్ష వేయని విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ తన భర్తనే ఎందుకు చంపారని ఆమె పోలీసులను ప్రశ్నించారు.అత్యాచారాలు చేసిన వారెంతమంది జైల్లో ఉన్నారని చెన్నకేశవులు తల్లి ప్రశ్నించారు. దిశ అత్యాచారం చేసిన నిందితులైన మా నలుగురు పిల్లలకే జైళ్లు లేవా, అక్కడ తిండి లేదా అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు లంచాలు తీని తన కొడుకును కాల్చి చంపారని ఆమె ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos