భారత సైనికులే తొలుత కవ్వించారు

భారత సైనికులే తొలుత కవ్వించారు

బీజింగ్: గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలకు భారత్ సైనికులే కారణమని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది.‘భారత సైనికులే తొలుత కవ్వించారు. ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేసి భారత బలగాలే వాస్తవాధీన రేఖ దాటాయ’ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ ఆరోపించారు. భారత సైనికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతూ, చైనా సైనికాధికారులపైనా, సైనికులపైనా దాడికి దిగినందునే భీకరమైన ఘర్షణ జరిగి పలువురు మృతి చెందారని వివరించారు. వాస్తవాల్ని కప్పి పెట్టి భారత్ వక్రభాష్యం చెప్పడం తగదని ఆక్షేపించింది. ‘మా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడంలో చైనా దృఢసంకల్పంతో వ్యవహరిస్తుంది. తక్కువగా అంచనా వేయొద్ద’ని చున్ యింగ్ హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos