సమస్యలపై నోరు మెదపని మోదీ

చింద్వారా:దేశంలో ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, రైతుల సంక్షోభం ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని ముఖ్యమంత్రి కమల నాథ్ విమ ర్శించారు.గురువారం ఇక్కడ జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.‘గత ఆరు నెలల్లో యువత పరిస్థితి గురించి మోదీ మాట్లాడడం ఎప్పుడైనా విన్నారా? రైతుల గురించి కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా?’ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ఇచ్చిన హామీ అమలు కాలేదు. రెండు కోట్ల ఉద్యోగాలు కాదు కానీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు పొందిన వాళ్ల పేర్లైనా చెప్పండ’ని ప్రశ్నిం చారు. ‘1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. దాని గురించి ప్రధాని ఎప్పుడూ మాట్లాడరు. నేను సర్జికల్ దాడులు చేశానంటూ గొప్పలు చెప్పు కుంటారు. ఏ సర్జికల్ దాడి చేయించారు? మాకు ఒక్క ఆధారం చూపించండి?’ ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos