న్యూ ఢిల్లీ: ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్ర బాబు నాయుడు నివాసం యజమాని ఎవ్వరో తేల్చి చెప్పాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి మరో మారు డిమాండు చేసారు. కరకట్టపై ఉన్న లింగమనేని అతిథి గృహాన్ని ల్యాండ్ పూలింగ్లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్లు 2016 మార్చి 6న చంద్ర బాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేసారు. దాఖలాల్లో మాత్రం ఇప్పటికీ అది లింగమనేని పేరుతోనే ఉందని తప్పుబట్టారు. అతిథి గృహం మరమ్మతుల కోసం రూ.ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. ఇంతకీ ఆ గెస్ట్ హౌస్ ఎవరిదో చంద్ర బాబు నాయుడే చెప్పాలని డిమాండ్ చేశారు.