సుప్రీం కోర్టుపై విసుర్ల వెల్లువ

సుప్రీం కోర్టుపై విసుర్ల వెల్లువ

న్యూఢిల్లీ: ‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాందోళన ఆగిపోయినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి విచారిస్తాం’ అని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం గురువారం చేసిన ప్రకటనకు సామాజిక మాధ్య మాల్లో ఎద్దేవా వెల్లువెత్తింది. ‘రక్తం కారడం ఆగిపోయినప్పుడే రోగి దగ్గరకు డాక్టర్ వస్తారు. కుళాయి నుంచి నీళ్లు కారడం ఆగి పో యి నప్పుడే ప్లంబర్ వస్తారు. పంట అమ్ముడు పోయాకే కోత కోస్తాం. ఆకలితో అల్లాడి కస్టమర్ స్పృహ తప్పాకే ఆహారాన్ని సరఫరా చేస్తాం. పెరగడం ఆగాకే గడ్డిని కత్తిరిస్తాం. ఆకలి తీరాకే అన్నం వండుతాం. ప్రయాణి కులు అందరు దిగిపోయాకే విమా నం దిగుతుంద’ని ట్వీట్లు వెలువడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos