ప్రధాని పర్యటన వేళ.. గుజరాత్‌లో మత ఘర్షణ

ప్రధాని పర్యటన వేళ.. గుజరాత్‌లో మత ఘర్షణ

గాంధీ నగర్ : ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించే వేళ మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్ జిల్లా భుజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ, అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే మోదీ శనివారం పర్యటించాల్సి ఉంది. భుజ్ మాదాపూర్లో శుక్రవారం సాయంత్రం స్థానిక పాల వ్యాపారం చేసే ఓ వ్యక్తిని కత్తితో హత్య చేశారు. ఈ వార్త దావానంలా వ్యాపించగా ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు వీధుల్లో విధ్వంసం సృష్టించారు. దుకాణాలతో పాటు ఓ మసీదును ధ్వంసం చేశారు. పోలీసులు శాంతి భద్రతలు దెబ్బ తినకుండా ఉండేందుకు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలు స్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos