నిర్మాణ రంగంలో అవినీతిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్ బిల్లును గవరవ్నర్ నరసింహన్ వెనక్కి పంపించారు.కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించి ఈనెల 18,19వ తేదీల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించి బిల్లును సభలో ఆమోదింపచేసుకున్నారు.అయితే బిల్లులో సర్వాధికారులు కలెక్టర్లకు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేతలు దీనిపై గరవ్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.దీంతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొత్త మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ వెనక్కి తిప్పి పించారు.ఈ నేపథ్యంలో గవర్నర్ సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది..