ఢిల్లీ : బంగారం ధర పరుగులకు అడ్డు కట్ట పడింది. శుక్రవారం పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.372 తగ్గి రూ.39,278కి చేరింది. రూపాయి బలపడడం, తయారీదార్ల నుంచి డిమాండ్ తగ్గడం వల్ల పసిడి ధర తగ్గిందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. వెండి ధర కూడా రూ.1,273 తగ్గి కిలో రూ.49,187కు చేరింది. ఈరోజు రూపాయి 21 పైసలు పుంజుకుందని, బంగారంలో పెట్టుబడులు తగ్గాయని విశ్లేషకులు చెప్పారు.