గోతిలో పడి ఏనుగు మృతి

గోతిలో పడి ఏనుగు మృతి

హోసూరు: ఇక్కడికి సమీపంలోని జవులగిరి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఆరు ఏళ్ల ఏనుగు గోతిలో పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రం బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుండి జవులగిరి ఆటవీ ప్రాంతానికి వందకు పైగా ఏనుగులు వలసవచ్చాయి. వారం రోజుల క్రితం వచ్చిన ఏనుగుల మంద అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి.ఈ ఏనుగుల మందలో ఉన్న 6 ఏళ్ల వయస్సుగల ఏనుగు పిల్ల అకస్మాత్తుగా అటవీప్రాంతంలోని లోతైన గోతిలో పడింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఏనుగు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఏనుగు పిల్ల మృతి చెందిన విషయాన్ని స్థానికులు జవులగిరి అటవీ శాఖ సిబ్బందికి తెలియజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గోతిలో పడి మృతి చెందిన ఏనుగును బయటికి తీసి శవ పరీక్ష నిర్వహించి ఖననం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos