ముంబై: అంతర్జీతీయ విపణిలో ముడి చమురు ధరలు 20 సంవత్సరాల కనిష్ఠానికి పతనం అయ్యాయి. కరోనా వైరస్ దీనికి కారణంగా భావిస్తున్నారు. సోమవారం క్రూడాయిల్ ధర కిందటి ముగింపుతో పోలిస్తే రూ. 473 తగ్గి, పీపా కు రూ. 2,686కు తగ్గింది. ఒక్క రోజులోనే దాదాపు 15 శాతం మేరకు ధర తగ్గింది. సహజవాయువు ధర 6.96 శాతం పడిపోయి రూ. 120కి దిగింది. బంగారం ధర పది గ్రాములకు రూ. 3 తగ్గి 44,155 వద్ద, కిలో వెండి ధర రూ. 1,079 తగ్గి రూ. 45,890 వద్దా ఉన్నాయి.