అలవైకుంఠపురం ఈవెంట్‌పై పోలీసులు సీరియస్‌..

  • In Film
  • January 9, 2020
  • 129 Views
అలవైకుంఠపురం ఈవెంట్‌పై పోలీసులు సీరియస్‌..

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రంపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఆ రోజు సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ ను శ్రేయాస్ మీడియా, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్వహించాయి. అయితే, అనుమతి తీసుకున్న సమయాని కన్నా అదనంగా మరికొంత సేపు కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ విషయంలో పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది.ఈ మేరకు శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, నిర్మాణ సంస్థ మేనేజర్ యగ్నేశ్ లపై కేసును నమోదు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 5 నుంచి 6 వేల మంది వరకూ అభిమానులు వస్తారని, రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమం ముగుస్తుందని చెప్పారని ఆయన అన్నారు. అయితే, దాదాపు 15 వేల మందిని నిర్మాణ సంస్థ ఆహ్వానించిందని, ఆరు వేల మంది దాటరని చెప్పి, మరింత మందిని తరలించడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అభియోగాలు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos