హైదరాబాదు : ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన మోసపూరితమైనదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. నిరుద్యోగులను మభ్యపెట్టే దుష్ట ఆలోచన అగ్నిపథ్ అని మండిపడ్డారు. సైనిక నియామక విధానాన్ని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నారాయణ ప్రశ్నించారు. నిరుద్యోగులతో చెలగాడుతున్నారని, జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు అదే కారణమని స్పష్టం చేశారు. కేంద్రం ఇకనైనా సాయుధ దళాల నియామకాల్లో పాత పద్ధతినే కొనసాగించాలని హితవు పలికారు.