‘ నా కులం మాట నిలబెట్టు కునే కులం ’

‘ నా కులం మాట నిలబెట్టు కునే కులం ’

అమరావతి:తన మతం, కులం గురించి దారుణంగా విమర్శించటం బాధ కల్గిస్తోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆక్రోశిం చారు. సోమవారం ఉదయం గుంటూరులో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రసంగించారు. నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. నా మతం మానవత్వం అని ఈ వేదికపై నుంచి చెప్పలదచుకున్నా. నా కులం మాట నిలబెట్టు కునే కులం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందాలని పని చేస్తున్నా’న అన్నారు.‘ ఓ గొప్ప కార్యక్రమానికి నేడు అంకురారోహణ జరిగింది. వైద్యం కోసం ఇకపై ఏ పేదవాడూ ఇబ్బంది పడబోడని హామీ ఇస్తున్నా. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే నా లక్ష్యమ’ని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద 26 విభాగాల్లో 836 శస్త్ర చికి త్సలకు ఆర్థికసాయం లభిస్తుంది. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలోనూ ఆర్థికసాయం అందుతుంది. తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకూ చెందిన 150కి పైగా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందిస్తాయని గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos