కోహిమ: పౌరసత్వ చట్టాన్ని సవరించినందుకు నిరసనగా శనివారం నాగాలాండ్లో బంద్ జరుగుతోంది. నాగా విద్యార్థి సమాఖ్య ఆరు గంటల బంద్కు పిలుపు నిచ్చింది. విద్యా సంస్థలు, దుకాణాలు తెరుచుకో లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర బలగాల మోహరించాయి.