తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మరోసారి విమర్శల బాణాలు సంధించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలొ నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు.అయితే అందులో కొన్ని పదాలను పలకడంలో జగన్ తడబడడంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బుద్దా వెంకన్న విమర్శలు చేశారు. ‘నిరా రక్షత’ అంటే నిరక్షరాస్యత, ‘దీవితాన్ని పణంగా’ అంటే జీవితాన్ని పణంగా, ‘సంఘ సస్కర్తలు’ అంటే సంఘ సంస్కర్తలు కాబోలు. ఆ ‘రాజిక సౌద్దన్నాన్ని’ అనేది మాత్రం అర్థం కాలేదు. మీకు అర్థమయితే చెప్పండి వీసారెడ్డి గారూ’ అంటూ ఎద్దేవా చేశారు.మీ ముఖ్యమంత్రి జగన్ హీరోయిన్ల పేర్లు చదువుతున్నారేంటి? ఓహో… నిరక్షరాస్యతకు వచ్చిన పాట్లా ఇవి అంటూ వెంకన్న సెటైర్ వేశారు. చూడకుండా ప్రసంగించే వ్యక్తి తప్పు మాట్లాడినప్పుడు ‘పప్పు’ అంటూ మీరు సంబరపడ్డారని… చూసి కూడా చదవలేనివాడిని ఏమంటారు విజయసాయిరెడ్డిగారూ… ముద్దపప్పు అనే కదా అంటారు అంటూ ఎద్దేవా చేశారు.
@VSReddy_MP గారు మీ ముఖ్యమంత్రి .@ysjagan హీరోయిన్ పేర్లు చదువుతున్నారు ఏంటి? ఓహో నిరక్షరాస్యత కి వచ్చిన పాట్లా. చూడకుండా ప్రసంగం చేసేవాడు తప్పు మాట్లాడితే మీరు పప్పు అని సంబరపడ్డారు.మరి చూసి కూడా చడవలేని వాడిని ఏమి అంటారు విజయసాయిరెడ్డి గారు?ముద్ద పప్పు అనేకదా అంటారు!! pic.twitter.com/LdE9MYwaKD
— venkanna_budda (@BuddaVenkanna) November 2, 2019