నవ నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ

నవ నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ

హోసూరు : ఇక్కడికి సమీపంలోని ఆవలపల్లి వద్ద నవ నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంబగ మన్నార్ రామానుజ స్వామి పాల్గొన్నారు. ఆయనకు మేళ తాళాలతో స్వాగతం పలికారు. భూ మి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, వాస్తు హోమం, గణపతి హోమం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి, హోసూరు యూనియన్ చైర్పర్సన్ శశి వెంకటస్వామి, జిల్లా కౌన్సిలర్ రవికుమార్ తదితరులు హాజరయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos