రూ.50 కోట్ల పన్ను ఎగవేత

రూ.50  కోట్ల  పన్ను ఎగవేత

విజయవాడ : కరకట్టలో తనకు ఇల్లు ఇచ్చినందుకే అక్రమాలకు పాల్పడిన లింగమనేని రమేష్ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపాడుకుంటూ వస్తున్నారని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో ప్రసంగించారు. తన నియోజక వర్గంలోనే లింగమనేని 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత ఐదేళ్లలో జరిగిన భూ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. లింగమనేని 40 ఎకరాల్లో విల్లాలు నిర్మించి ఒక్కొ దాన్ని రూ. 5కోట్లకు అమ్మి, లే ఔట్ రుసుమలు చెల్లించలేదని ఆరోపించారు. ‘ చదరపు గజం భూమి విలువ రూ. 4 వేలుగా రిజిస్ట్రేషన్ విలువ చూపించారు. వీటి వల్లే సుమారు 50 నుండి 60 కోట్ల రూపాయలు ఎగవేశారు. చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో వేరే వాళ్లకు మార్పిడి చేసుకున్నారు. రూ. 250 కోట్లరూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేని రమేష్ ను చంద్రబాబు నాయుడు కాపాడుకుంటూ వస్తున్నా’ని దుయ్య బట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos