అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

కొల్కత్తా : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షా కు సవాలు విసిరారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు. ఈ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచే అత్యత్తమ బీజేపీ అభ్యర్థులు వీరేనని అభిషేక్ బెనర్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కొల్కొత్తలోని రాజ్భవన్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా… ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉందన్నారు. అయితే ఈ లోక్సభ స్థానం నుంచి అభ్యర్థిని నిలపడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పారు. ఈ ఘటనతో బెంగాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ప్రస్పుటమవుతోందని తెలిపారు. అలాంటి బీజేపీ డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంపై ఆరోపణలు గుప్పిస్తుందన్నారు. ఈ నియోజకవర్గం ప్రతిష్ట దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారంటు బీజేపీ నేతలపై ఈ సందర్బంగా మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos