రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు,ఇష్టాలు ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉండే మంత్రి కేటీఆర్ తాజాగా తన తాతయ్యతో కలసి ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.తన తాతయ్య (అమ్మ తరఫు) ఫొటో పోస్టు చేశారు. “ఈ ఫొటో చూశారా… మా తాతయ్య స్వర్గీయ జె.కేశవరావు గారు. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. అనేక పర్యాయాలు జైలుకెళ్లొచ్చారు. ఆయన పట్ల నేనెంతో గర్విస్తుంటాను” అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.