దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన అనంతరం సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.పదేళ్ల క్రితం యాసిడ్ దాడిలో నిందితుల ఎన్కౌంటర్,మూడేళ్ల క్రితం నయీమ్ ఎన్కౌంటర్,తాజాగా దిశ నిందితుల ఎన్కౌంటర్తో నేరస్థులకు సింహస్వప్నంగా మారిన సజ్జనార్ యూత్కు ఫేవరేట్గా మారారు.తాజాగా తమ ఇలవేల్పు వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన లేపాక్షికి వచ్చిన సజ్జనార్ అక్కడి వీరభద్రస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.ఈ క్రమంలో సజ్జనార్ను యువతీ యువకులు సజ్జరార్తో కలిసి ఫోటోలు దిగేందుకు పోటీ పడటమే కాదు.. క్యూ కట్టటం గమనార్హం. ఇక లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయానికి సంప్రదాయ పంచెకట్ట, లాల్జీ ధరించి, కుటుంబీకులతో కలిసి సజ్జనార్ రాగా, ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు.