విజయనగరం : ఈ నెల 8 వ తేదీన సమ్మె నిర్వహించనున్నట్లు ఆర్టిసి కార్మికులు పిలుపునిచ్చారు. నేషనల్ మంజ్థూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎపిఎస్ఆర్టిసి విజయనగరం డిపో వద్ద శనివారం చలో ఆర్ఎం ఆఫీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంప్లెక్స్ చుట్టూ ర్యాలీ చేసిన అనంతరం ఆర్ఎం ఆఫీసు కు చేరుకున్నారు. కార్మిక నేతలు మాట్లాడుతూ.. 01-04-2017 నుండి కార్మికులకు రావల్సిన పే స్కేలు విషయమై యాజమాన్య జాప్యం, గుర్తింపు సంఘమైన ఎంప్లాయిస్ యూనియన్ వైఫల్యాలను నిరసిస్తూ.. ఈ నెల 8 వ తేదీన చేపట్టనున్న సమ్మెకు కార్మికులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెక్ రీజియన్ ఆధ్వర్యంలో తొమ్మిది డిపోల కార్మికులు, రాష్ట్ర కార్యదర్శులు కె.రాములు, నరసింగరావు, సూరప్పడు, ఆర్టిసి కార్మికులు పాల్గన్నారు.