విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 5 వరకు మహాపాదయాత్రను చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె. లెనిన్ బాబు, ఎస్.పి. మనోహర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు, ఏలూరు నుంచి రెండు టీమ్లుగా ఉపాధ్యాయులు మహాపాదయాత్రను చేపట్టి విజయవాడ చేరుకోనున్నట్లు తెలిపారు.