జీ అధిపత్యాన్ని కోల్పోనున్న సుభాష్‌

జీ అధిపత్యాన్ని కోల్పోనున్న సుభాష్‌

ముంబై: జీ ఎంటర్ టైన్ మెంట్ పై సుభాష్ చంద్ర ఆధిపత్యాన్ని కోల్పోనున్నారు. ఆ సంస్థలో 16.5 శాతం వాటాను విక్రయించ దలచటమే ఇందుకు కారణం. లావాదేవీలు పూర్తైతే సంస్థలో ఆయన వాటా ఐదు పరిమితమై ఆధిపత్యాన్ని కోల్పోతారు. భారత టెలివిజన్ ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో జీ మీడియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 1992లో సుభాష్ చంద్ర దీన్ని స్థాపిం చారు. ఆ తర్వాత వ్యాపారాన్ని ప్యాకేజింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, విలువైన లోహాలు, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలకు విస్తరించారు. రుణ బకాయిల్ని తీర్చేందుకే 16.5 వాటాను విక్రయిస్తున్నారు. గత జనవరిలో కూడా 11 శాతం వాటాను ఇన్వె స్కో సంస్థకు రూ. 4,224 కోట్లకు విక్రయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos