ముంబై : యువరాజ్ సింగ్ పనై పోయిందని అతని విమర్శకులు అనుకోవడం కద్దు. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా యువీ తన విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా మాల్దీవుల రాజధాని మాలెలో జరిగిన ఓ మ్యాచ్లో స్పిన్నర్ వేసిన ఓ బంతిని యువీ రివర్స్ స్వీప్ ద్వారా సిక్సర్కు తరలించాడు. ప్రస్తుతం ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టపరచే క్రమంలో భాగంగా ఆ దేశ జట్టుతో ఎయిర్ ఇండియా స్నేహపూర్వకమైన మ్యాచ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు క్రికెట్ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు