పావురాల గుట్ట వద్ద వైఎస్‌ఆర్‌ స్మృతి వనం

పావురాల గుట్ట వద్ద వైఎస్‌ఆర్‌ స్మృతి వనం

అమరావతి: వై.ఎస్ రాజశేఖర రెడ్డి కనుమరుగైన పావురాల గుట్ట ప్రాంతంలో రూ.పాతిక కోట్ల వ్యయంతో స్మృతివనాన్ని నిర్మిస్తామని అటవి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడ అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి కర్నూలు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ కూలిపోవడంతో మృతి చెందటం తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎర్ర చందనం పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం నిల్వల్లో 5,000 టన్నులను అమ్మేందుకు కేంద్రం అనుమతి కోరామని తెలిపారు. వన్యప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయే కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos