గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం..యువకుడి మృతి

గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం..యువకుడి మృతి

హొసూరు : ఇక్కడికి సమీపంలోని ఓ గ్రానైట్ కంపెనీలో తలపై గ్రానైట్ రాయి పడిన సంఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. సూలగిరి ఆలగుబావి గ్రామం వద్ద ప్రైవేట్ గ్రానైట్ కంపెనీలో 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు.సాయంత్రం ఉత్తరప్రదేశ్‌కు  చెందిన కార్మికుడు విధులు నిర్వహిస్తుండగా తలపై గ్రానైట్‌ రాయి పడింది. తీవ్రంగా గాయపడిన అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సూలగిరి పోలీసులు శవాన్ని స్వాధీనపరచుకుని, హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos