ప్రియురాలు చికెన్ పకోడీ తినలేదని..

ప్రియురాలు చికెన్ పకోడీ తినలేదని..

నేటి కాలం యువతకు ప్రాణమంటే ఏమాత్రం లెక్కలేదనే నిజాన్ని కృష్ణ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన రుజువు చేస్తోంది.తాను తెచ్చిన చికెన్‌ పకోడి ప్రియురాలు తినలేదని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను(25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. క్రమంలో శ్రీను, ఆమె ఈనెల 19మచిలీపట్నం వెళ్లివచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడిపకోడి తెచ్చుకున్నాడు. రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు.దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు మహిళ తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos