వైకాపాకు ఎప్పుడూ విధేయుడినే

వైకాపాకు ఎప్పుడూ విధేయుడినే

అమరా వతి: వైకాపా నుంచి సంజాయిషీ పత్రాన్ని అందుకున్న ఆ పార్టీ లోక్సభ సభ్యుడు రఘు రామకృష్ణం రాజు సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో ముఖాముఖికి విన్నవించారు. విజయ సాయి రెడ్డి సంయిషీ తాఖీదుల్ని ఇవ్వటంతో తాను లేఖ రాసినట్లు వివరించారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నా సంజాయిషీ తాఖీదులు అందయి. కానీ పార్టీ అసలు పేరు యువజన శ్రామిక,రైతు కాంగ్రెస్ పార్టీ అయినందున నాకు ఇచ్చిన ఆ తాఖీదులు చెల్లవు. నేను వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడిని. తితిదే ఆస్తుల వేలాన్ని ఆక్షేపించాను. ప్రజా అభిప్రాయం కూడా అదే. అంతే తప్ప నేను సిఎంను కానీ, పార్టీని కాని ఏమీ అనలేదు. నేను ఎప్పుడూ పార్టీకి విధేయుడినే. ఇసుక విషయాన్ని మీ దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించా. అది కుదరక పోవడంతో మరో మార్గం లేక విలేఖరులకు చెప్పా. మీ చుట్టూ ఉన్న కొందరు నన్ను క్రిస్టియన్ వ్యతిరేకిగా ముద్ర వేయాలని చూస్తున్నారు. నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డు పడు తున్నారు. మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాల’ని రఘు రామ కృష్ణం రాజు కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos