ఇంటిపై రూ. 40 లక్షల మూట..

ఇంటిపై రూ. 40 లక్షల మూట..

డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. పచ్చనోటు కనబడితే నొక్కేయాలని చాలామంది చూస్తుంటారు. ధనానికున్న పవర్ అది. ఐతే తెల్లారి లేచిన అతడికి తన ఇంటి పైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే నోట్ల కట్టలు, బంగారం వుంది. అంతే… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఉత్తరప్రదేశ్ మీరట్‌లో నివాసం వుంటున్న వరుణ్ శర్మ బుధవారం పొద్దునే లేచి ఇంటి బయటకు వచ్చి పైకి చూడగానే తన ఇంటిపైకప్పుపై రెండు బ్యాగులు కనిపించాయి. అవి ఏంటా అని కిందికి దింపి చూస్తే అందులో డబ్బు నోట్ల కట్టలు, బంగారం వున్నాయి. సహజంగా ఇలా డబ్బు కనబడితే ఎవరైనా కాస్తోకూస్తో నొక్కేయాలని చూస్తారు.కానీ అతడు మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శర్మ ఇంటికి ఆనుకుని వున్న భవనం నుంచి ఈ బ్యాగులు పడవేసినట్లు తేల్చారు. ఆ ఇంట్లో దొంగతనం చేసి, ఇంటికి అమర్చిన సిసి కెమేరాలకు కనబడకుండా వుండేందుకు ఇలా బ్యాగులను విసిరేసినట్లు తేల్చారు. ఈ పని చేసింది ఆ ఇంటికి సెక్యూరిటీగా వుండే నేపాల్ వ్యక్తి అని ప్రాధమిక విచారణలో తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos