మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

అమరావతి : వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. దీనిపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయిదేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ పదవిలో ఉండిన నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. గత జూన్‌లోనే వైకాపా అధికారంలోకి వచ్చినా, గవర్నర్‌కు అందించాల్సిన మహిళా కమిషన్‌ నివేదిక తయారీలో ఆలస్యం జరిగిందని, అందువల్ల నివేదిక పూర్తయ్యే వరకు తాను పదవిలో కొనసాగానని రాజకుమారి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos